గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
108 నక్షత్ర పాద శివలింగాలు యొక్క Ebook ఉచితంగా Download చేసుకోండి
గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
నర్సిపూడి గ్రామం / NARSIPUDI VILLAGE
శ్రీ ఉమా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి
తులారాశి, విశాఖ నక్షత్రం (2వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా సుమారు 29 kms. దూరాన నర్సిపూడి (Narsipudi) అను గ్రామం కలదు. మండపేట - ఆలమూరు రోడ్డు మార్గములో గుమ్మిలేరు గ్రామం ఉంటుంది. గుమ్మిలేరు బస్ స్టాప్ కు వాయువ్యం దిశగా సుమారు 04 Kms. దూరంలో నర్సిపూడి గ్రామం కలదు. ఇచ్చట శ్రీ సోమేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ ఉమా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం విశాఖ నక్షత్రం (2వ పాదం) చెందినది. శ్రీ సోమేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: నర్సిపూడి గ్రామం లోని శ్రీ ఉమా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. జగద్గురువులు చంద్రశేఖర స్వామిజీ మరియు జయేంద్ర సరస్వతీ స్వామివారు నర్సిపూడి శివాలయం సందర్శించినారు. జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు కంచి కామకోటి పీఠం నకు 68వ పీఠాధిపతి. వీరు దేశమంతటా 3సార్లు పాదయాత్రలు చేశారు. చంద్రశేఖర స్వామిజీతో పాటు జయేంద్ర సరస్వతీ స్వామివారు కూడ పాదయాత్రలు చేశారు. జగద్గురువులు తమ యాత్రలో అనేక ఆలయాలు సందర్శించినారు. ఆ యాత్రలో నర్సిపూడి గ్రామం లోని శ్రీ ఉమా పార్వతీ సమేత సోమేశ్వర ఆలయం ఒకటి. జగద్గురువులు నర్సిపూడి ఆలయం నందు అయ్య వారికి అభిషేకాలు, అమ్మ వారికి అర్చనలు నిర్వహించారు అని గ్రామ ఆర్యులు చెప్పుచుంటారు. ప్రస్తుత ఆలయం 2009 సంవత్సరములో జీర్ణోదరణ గావించారు. 2011సంవత్సరములో పునః ప్రతిష్ట జరిగింది. తూర్పు ముఖద్వాం నుంచి ఆలయ ప్రవేశం జరుగుతుంది.
ఆలయ ప్రాంగణము విశాలముగా ఉంటుంది. ప్రధానాలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. ఆలయం నకు తూర్పున ధ్వజస్ధభం, ఆగ్నేయ మూల యాగ శాల, వాయువ్య మూల పంచముఖ ఆంజనేయస్వామి, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మరియు ఈశాన్య మూల నవగ్రహ మండపం ఉన్నాయి. ఆలయ ప్రాంగణములో చండీశ్వర స్వామి ఉన్నాడు. ముఖ మండపం నందు నందీశ్వరుడు ఉంటాడు. శ్రీ ఉమా పార్వతీ దేవి మరియు గణపతి స్వామి వారి సన్నిధిలు కలవు. అంతరాలయం నందు ఉత్సవ మూర్తులు కొలువైన్నారు. గర్భాలయం నందు శ్రీ సోమేశ్వర లింగము దర్శనమిస్తుంది. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి కళ్యాణం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు జరుగుతాయి. మహాశివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు ఉంటాయి. సంక్రాంతి, దీపావళీ మొదలగు పర్వదినాలు సందర్భముగా పూజలు విశేషంగా జరుగుతాయి.
శ్రీ సోమేశ్వర లింగము, విశాఖ నక్షత్రం (2వ పాదం) చెందినది. విశాఖ నక్షత్రం నందలి 2వ పాదము లో జన్మంచిన స్త్రీ వలన మరదలుకి, పురుషుడు వలన బావమరిదికి దోషం కలుగను. విశాఖ నక్షత్రం (2వ పాదం) నందు జన్మించిన వారికి ఆలయం నందు అభిషేక శాంతులు నిర్వహించుతారు.
రవాణా సమాచారం: ద్రాక్షారామం నుంచి రాజమండ్రి బస్సులు (via) రామచంద్రపురం, మండపేట మీదగా ఉంటాయి.
రవాణా సమాచారం: మండపేట (కలువ పువ్వు సెంటర్) నుంచి నర్సిపూడి గ్రామం నకు (via) గుమ్మిలేరు మీదగా ఆటోలు దొరుకుతాయి. మండపేట నుంచి నర్సిపూడి గ్రామం దూరం సుమారు 09 Kms. గా ఉంటుంది.
రవాణా సమాచారం: గుమ్మిలేరు నుంచి నర్సిపూడి గ్రామం నకు ఆటోలు ఉంటాయి. గుమ్మిలేరు నుంచి నర్సిపూడి గ్రామం దూరం సుమారు 04 Kms. గా ఉంటుంది.
అర్చక స్వామి: ఆలయ సమాచారం & Photos అందించిన నర్సిపూడి - శ్రీ సోమేశ్వర స్వామి, ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ కాళ్ళకూరి కాశీ శేఖర్ బాబు, సెల్ నెం. 9908810995 గార్కి నా నమసుమాంజలి.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
విశాఖ నక్షత్రం స్తోత్రం
ఇంద్రాగ్నీ ఆగాత్ సుతం గీమినేమో వరేణాయ భూ:|
అస్య పాతం ధియేషితా||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.
Vishakha Nakshatra Star Mantra Japa | Shukra & Angaaraka | Vishaka Nakshatra Mantra Chanting | Nakshatra Suktam
Experience the divine vibrations of Vishakha Nakshatra Mantra Japa, rendered with spiritual precision by Sri Satyanarayana Bhat, Sri Govinda Prakash Bhat Ghanapati, and Sri K. Suresh.
This sacred chanting includes:
🔹 Vishaka Nakshatra Mantra from Nakshatra Suktam
🔹 Swaahaakaaram (Homa Mantra)
🔹 The Navagraha Suktam Mantra connected to the ruling planets Shukra (Venus) and Angaaraka (Mars) from the Yajur Veda
Vishakha (Visakha) Nakshatra is known for:
✔ Determination
✔ Achievement
✔ Focus
✔ Passion
✔ Growth & transformation
People born in Vishakha Nakshatra often seek spiritual development, inner strength, and clarity.
Regular listening to this mantra helps balance the energies of Shukra (Venus) and Angaaraka (Mars) and brings:
✨ Peace of mind
✨ Relationship harmony
✨ Removal of obstacles
✨ Inner courage & stability
✨ Spiritual purity
✨ Strength during Vishakha Nakshatra transit
✨ Healing of karmic influences
This chanting is highly beneficial during:
🔸 Vishakha Nakshatra days
🔸 Birth star birthday (Janma Nakshatra)
🔸 Shukra or Mangal dosha remedies
🔸 Homa, puja, meditation, or daily worship
✔ Vishakha Nakshatra mantra (Nakshatra Suktam)
✔ Swaahaakaara Homa mantra
✔ Shukra & Angaaraka Navagraha Suktam
✔ Traditional Vedic intonations by expert scholars
✔ Clear, authentic, powerful recitation
Chanted by:
🎙 Sri Satyanarayana Bhat
🎙 Sri Govinda Prakash Bhat Ghanapati
🎙 Sri K. Suresh
A deeply devotional rendition rooted in Vedic tradition.